Samsung Galaxy S23 FE | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ భారత్ మార్కెట్లో వచ్చే ఏడాది జనవరి నాలుగో తేదీన గెలాక్సీ టాబ్ ఎస్9 ఎఫ్ఈ, గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ తోపాటు తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ఆవిష్కరించనున్నది. శాంసంగ్ ‘ఫ్యాన్ ఎడిషన్’ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ 6.4-అంగుళాల డైనమిక్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటది. గ్లోబల్ మార్కెట్లలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ తో ఆవిష్కరించగా, భారత్ లోకి ఎక్స్ నోస్ 2200 చిప్ సెట్ తో వస్తున్నది. పర్పుల్ కలర్ ఆప్షన్లో 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్గా ఫ్లిప్కార్ట్ లో లిస్టయింది.
రెండేండ్ల క్రితం 2021లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ కొనసాగింపుగా ఈ ఏడాది శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ఆవిష్కరించింది. ఈ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 12-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ లెన్స్, 8-మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.59,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.64,999లకు లభిస్తున్నది.