Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ నుంచి మరో ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానున్నది. శాంసంగ్ తన ఎఫ్ సిరీస్లో ‘శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ’ ఫోన్ త్వరలో భారత్లో ఆవిష్కరించనున్నది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీతో వస్తున్నదని పేర్కొంటూ శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో మైక్రోసైట్ క్రియేట్ చేసింది. ఎల్ఈడీ ఫ్లాష్తో త్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్తోపాటు గొరిల్లా గ్లాస్-5 ప్రొటెక్షన్ ఉంటుందని భావిస్తున్నారు. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ సపోర్ట్ ఫర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఉంటుంది. సింగిల్ టేక్, ఫన్ మోడ్లో డిఫరెంట్ ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ ఫీచర్లకు సపోర్ట్గా ఉంటది. సింగిల్ చార్జింగ్ తో రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని శాంసంగ్ చెబుతున్నది.
శాంసంగ్ తన గెలాక్సీ ఏ34 5జీ ఫోన్ను రీబ్రాండ్ చేసి గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్గా మార్కెట్లోకి తెస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గెలాక్సీ ఏ34 5జీ ఫోన్ బేస్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.30,999 నుంచి ప్రారంభం అవుతుంది. త్వరలో వచ్చే గెలాక్సీ ఎఫ్54 ఫోన్ ధర కంటే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ధర ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.