హైదరాబాద్, అక్టోబర్ 30: జాతీయ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) హైదరాబాద్ చాప్టర్ హెడ్గా సంపత్ తుమ్మల నియమితులయ్యారు. హైదరాబాద్ చాప్టర్ హెడ్గా పనిచేసిన శంకర్ కృష్ణమూర్తి, కవిత మంతలను నేషనల్ మేనేజింగ్ కమిటీలో తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎఫ్అండ్బీ రంగానికి ఇండస్ట్రీ హోదా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రముఖ హీరోలు అల్లరి నరేశ్, అడివి శేషు, నందిని రెడ్డి, రవితేజ రావురి తదితరులు నూతన కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా 5 లక్షల రెస్టారెంట్లు దీంట్లో సభ్యులుగా ఉన్నారు.