న్యూఢిల్లీ, మార్చి 8: ప్రముఖ సినీ తార సమంత .. తాజాగా ఈ-కామర్స్ వ్యాపరంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే ఈ-కామర్స్ రంగంలో ఉన్న సైస్టెన్కార్ట్లో పెట్టుబడి పెట్టారు. ఎంతమేర పెట్టుబడులు పెట్టిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే ఆన్లైన్లో దుస్తులను విక్రయిస్తున్న సైస్టెన్కార్ట్..తాజాగా తొలి రిటైల్ అవుట్లెట్ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. గతేడాది మొదట్లో ప్రారంభమైన సైస్టెన్కార్ట్..ప్రస్తుతం వెయ్యి బ్రాండ్లను విక్రయిస్తున్నది. ఇక నుంచి ఫ్రాంచైజ్ పద్దతిన రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కంపెనీ సీఈవో కాంత్ దత్ తెలిపారు. తొలి ఏడాది 30 స్టోర్లు, వచ్చే రెండేండ్లలో 100 స్టోర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.