న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్)లో 20 శాతం వాటాను అమ్మనున్నది. అలాగే రాష్ట్రీయ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఆర్సీఎఫ్) కంపెనీలో 10 శాతం వాటాను ఉపసంహరించుకోనున్నది. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు మే 5లోగా బిడ్లు దాఖలు చేయాలని మర్చంట్ బ్యాంకర్లను ఆహ్వానించింది. ప్రస్తుతం కేంద్రానికి ఎన్ఎఫ్ఎల్లో 74.71 శాతం, ఆర్సీఎఫ్లో 75 శాతం చొప్పున వాటాలున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) వెల్లడించింది.