హైదరాబాద్, మే 24: పలు భాషల్లో కంటెంట్ అందిస్తున్న రిసోర్సియోలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాల కృష్ణన్ పెట్టుబడులు పెట్టారు. ఎంతమేర పెట్టుబడులు పెట్టిన వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు.
ఆరు నెలల క్రితం కంటెంట్ సేవలు ఆరంభించిన సంస్థకు అనతి కాలంలో అంతర్జాతీయంగా 25 లక్షల మంది విజిటర్లు ఉన్నారు. వీరిలో 18 శాతం మంది తెలుగువారు ఉండటంతో సంస్థ సరికొత్తగా తెలుగు కంటెంట్ సేవలను ఆరంభించింది. భవిష్యత్తులో సంస్థ ఇంగ్లీష్, తమిళం, కన్నడ, సంస్కృతి, అరబిక్ భాషల్లో కూడా కంటెంట్ సేవలు ఆరంభించనున్నట్లు కంపెనీ సీఈవో గీతికా సుదీప్ తెలిపారు.