ముంబై, ఏప్రిల్ 10 : గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన రూపాయి మళ్లీ జారుకున్నది. అనూహ్యంగా డాలర్కు డిమాండ్ పెరగడంతో ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్నాయి. ఇదే క్రమంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం ఒకేరోజు 32 పైసలు పతనం చెంది 92.83కి పడిపోయింది.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం రూపాయి పతనానికి ఆజ్యంపోశాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. 92.58 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 92.41 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 32 పైసలు కోల్పోయి 92.83 వద్ద స్థిరపడింది.