ముంబై, డిసెంబర్ 27: డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 15 పైసలు దిగజారి 83.34 వద్దకు పడిపోయింది. దేశం నుంచి తరలిపోతున్న విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులతోపాటు బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరుగుతున్న డిమాండ్.. రూపాయిని దెబ్బతీసింది. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కదలాడినా ఆ ప్రభావం ఫారెక్స్ మార్కెట్పై పడలేదని ట్రేడర్లు చెప్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఒడిదుడుకులపై మదుపరుల్లో ఆందోళనలు, ఎర్ర సముద్ర మార్గంలో సాగే అంతర్జాతీయ వర్తక లావాదేవీల్లో అంతరాయం సైతం రూపీని కోలుకోకుండా చేశాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక బుధవారం ట్రేడింగ్లో ఒకానొక దశలో రూపీ విలువ 83.20 స్థాయికి కోలుకోగా, మరోసారి 83.35కు పతనమైంది. చివరకు 83.34 వద్ద నిలిచింది. దీంతో మంగళవారం నాటి ముగింపుతో పోల్చితే 15 పైసలు నష్టపోయినైట్టెంది. మంగళవారం సైతం 3 పైసలు పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో వరుస రెండు రోజుల్లో 18 పైసల విలువను రూపీ దిగజార్చుకున్నైట్టెంది.