హైదరాబాద్: రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఇటీవల న్యూ లుక్ లో మార్కెట్ లోకి విడుదలైన విషయం తెలిసిందే. గతంలో ఉన్న మోడల్ తో పోలిస్తే సరికొత్త ఫీచర్స్ తో దీనిని ప్రవేశపెట్టారు. ఇండియా మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే లక్ష యూనిట్ల ఉత్పత్తిని దాటింది. ప్రస్తుతం దేశంలో పలు వాహన తయారీ కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ అత్యంత సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించగలిగింది.
ఈ మోడల్ 2021 సెప్టెంబర్ లో ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ మోడల్ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 భారత్తో పాటు యూరప్, దక్షిణాసియా, ఆస్ట్రేలియా మరియు దక్షిణ అమెరికాలో విక్రయించబడుతోంది. ఇది ఇండియా మార్కెట్లోను ఎక్కువ సంఖ్యలో విక్రయించిన బైక్ గా నిలిచింది. ఈ బైక్ కు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని మరింతగా వేగం చేసింది ఆ సంస్థ. అయినప్పటికీ బుక్ చేసుకున్న వినియోగదారులు వేచి చూడాల్సి వస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ రూ.1.84 లక్షల ధర ఉన్నది. రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్నది.