న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ప్రముఖ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్..దేశీయ మార్కెట్లోకి తన తొలి ఎలక్ట్రిక్ మోటర్సైకిల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లైయింగ్ పీ సీ6 పేరుతో విడుదల చేసిన ఈ బైకు ప్రారంభ ధర రూ.2.79 లక్షలుగా నిర్ణయించింది. కానీ, బ్యాటరీ-యాస్-ఏ-సర్వీసెస్(బాస్) పద్దతిన తీసుకుంటే ఈ మోటర్సైకిల్ ధర మాత్రం రూ.1.99 లక్షలు. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ స్పోర్ట్స్ బైకును విడుదల చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
3.91 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ బైకు బ్యాటరీ సింగిల్ చార్జింగ్తో 154 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 3.7 సెకండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ బైకు గంటకు 115 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. అలాగే 65 నిమిషాల్లోనే బ్యాటరీ 20 శాతం నుంచి 80 శాతం రీచార్జికానున్నది. ఈ బైకులో ఎల్ఈడీ లైటింగ్, గూగుల్ ఆధారంగా పనిచేసే నావిగేషన్, వైర్లెస్ ఫోన్ చార్జింగ్ సాకెట్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.