Reliance | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఇన్వెస్టర్లకు రిలయన్స్ షాక్ ఇచ్చింది. గతేడాది (2021-22)తో పోలిస్తే 2022-23 తృతీయ త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం 15 శాతం పడిపోయింది. రిలయన్స్ శుక్రవారం డిసెంబర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2022 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ రూ.15,792 కోట్లకు పరిమితమైంది. మార్కెట్ వర్గాలు రూ.15,990 కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేశాయి.
ఆదాయ సముపార్జనలో మాత్రం రిలయన్స్ 15.3 శాతం వృద్ధితో రూ.2.20 లక్షల కోట్ల రెవెన్యూ సంపాదించింది. మార్కెట్ వర్గాలు కేవలం రూ.2.18 లక్షల కోట్ల ఆదాయం సంపాదిస్తుందని భావించాయి. ఇదిలా ఉంటే, నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్ల ద్వారా రూ.20 వేల కోట్ల నిధులు సేకరించాలని రిలయన్స్ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది.
ఆయిల్ టూ కెమికల్స్ బిజినెస్లో కన్సాలిడేటెడ్ రెవెన్యూ 10 శాతం పెరిగి రూ.1.44 లక్షల కోట్లకు చేరుకున్నది. రిలయన్స్ బిజినెస్లో ఆయిల్ టు కెమికల్స్ 65 శాతం వాటా కలిగి ఉంటుంది.