న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సహా అన్నింటి ధరలూ చుక్కలు చూస్తున్నాయి. ధరల పెరుగుదలతో అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం అంతకుముందు నెలతో పోలిస్తే 4.35 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగింది. ఇక ఆహార ద్రవ్యోల్బణం సైతం సెప్టెంబర్లో 0.68 శాతం నుంచి అక్టోబర్లో 0.85 శాతానికి పెరిగింది.
ఆర్బీఐ అంచనాల పరిధిలోనే ద్రవ్యోల్బణ గణాంకాలు ఉండటం కొంత ఊరట ఇస్తున్నా నిత్యావసరాల ధరలు భగ్గుమనడం సామాన్యుడికి భారంగా మారింది. ఇక కొవిడ్-19 నుంచి ఆర్ధిక వ్యవస్ధ పుంజుకుంటుండటంతో సెప్టెంబర్లో పారిశ్రామిక ఉత్పాదక సూచీ (ఐఐపీ) అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3.1 శాతం వృద్ధి నమోదు చేసింది.