న్యూఢిల్లీ, నవంబర్ 4: రిలయన్స్ రిటైల్.. మరో నూతన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నది. సెలూన్ విభాగంలో ఇప్పటికే సేవలు అందిస్తున్న చెన్నైకు చెందిన నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో 49 శాతం వాటాను కొనుగోలు చేయాలనుకుంటున్నది.
ఇందుకు సంబంధించి నేచురల్ ప్రమోటర్లతో రిలయన్స్ రిటైల్ వర్గాలు చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం నేచురల్కు దేశీయంగా 650కి పైగా సెలూన్ సెంటర్లు ఉన్నాయి. 2000లో తన సేవలు ఆరంభించిన నేచురల్.. 2025 నాటికి 3 వేల సెలూన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నది.