హైదరాబాద్, ఆగస్టు 24: రిలయన్స్ రిటైల్ హైదరాబాద్లో సరికొత్త అవుట్లెట్ను ప్రారంభించింది. యువతను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ఈ అవుట్లెట్ పేరు‘యూస్తా’గా నిర్ణయించింది. దేశంలో తొలి అవుట్లెట్ నగరంలో ప్రారంభించడం విశేషం. త్వరలో ముంబై, ఢిల్లీలో ఈ అవుట్లెట్ను ప్రారంభించాలనకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ అవుట్లెట్లో అన్ని రకాల ఉత్పత్తుల ధరలు రూ.999లోపే. దీంట్లో మెజార్టీ దుస్తులు రూ.499 అని కంపెనీ సీఈవో, ప్రెసిడెంట్ అఖిలేష్ ప్రసాద్ తెలిపారు. ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్లో ఏజియో, జియోమార్ట్లో కూడా యూస్తా ఫ్యాషన్ దుస్తులను సైతం విక్రయిస్తున్నది.