Reliance Jio Special Offer |టెలికం సంచలనం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని ద్వారా రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. తమ ప్రతి కస్టమర్కు అందుబాటు ధరలోకి రీచార్జి ప్లాన్ తేవడమే తమ లక్ష్యం అని జియో వెల్లడించింది. జియో ఫోన్ వినియోగదారుల్లో ఆరు రకాల ప్రీపెయిడ్ ప్లాన్లపై ఈ బెనిఫిట్లు లభిస్తాయి.
జియో ఫోన్ వినియోగదారులు రూ.75తో రీఛార్జ్ చేసుకుంటే అంతే మొత్తం అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ రూ. 39, రూ. 69, రూ. 75, రూ. 125, రూ.155, రూ.185 రీఛార్జ్ ప్లాన్లకు వర్తిస్తుంది. రూ. 39తో రీఛార్జ్ చేసుకుంటే ప్రతి రోజూ అపరిమిత వాయిస్ కాల్స్తోపాటు 100ఎంబీ ఉచిత డేటా పొందుతారు. దీని కాల పరిమితి 14 రోజులు. తాజా ఆఫర్లో 200ఎంబీ డేటాను పొందవచ్చు.
రూ.69 ప్లాన్ తీసుకుంటే ఇప్పుడు 0.5 జీబీ డేటా లభిస్తుండగా, ఇప్పుడు ఒక జీబీకి పెరుగుతుంది. రూ.75 ప్లాన్తో అపరిమిత వాయిస్ కాల్స్తోపాటు 28 రోజులూ 3జీబీ డేటా పొందేవారు ఇక 6జీబీ డేటా అందుకోవచ్చు.
రూ.125 ప్రీపెయిడ్ ప్లాన్పై ఇప్పడు 28 రోజుల పాటు ప్రతి రోజూ 0.5జీబీ డేటా లభిస్తున్నది. ఇక ఒక జీబీ డేటా అందుకోవచ్చు. మరోవైపు రూ.155 ప్లాన్ మీద అపరిమిత కాల్స్తోపాటు ఒక జీబీ డేటాకు బదులు రోజూ రెండు జీబీల డేటా పొందవచ్చు. రూ.185 ప్రీ పెయిడ్ ప్లాన్లో ఇప్పుడు ఉచిత వాయిస్ కాల్స్తోపాటు 2జీబీకి బదులు 4జీబీల డేటా లభిస్తుంది.