హైదరాబాద్, నవంబర్ 10: దీపావళి పండుగ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్లో ఎలక్ట్రానిక్స్ పరికరాలు, టీవీ, గృహోపకరణాలు, ఆడియో పరికరాలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర వస్తువులను కొనుగోలు చేసిన వారికి రూ.15 వేల వరకు ఇన్స్టంట్ రాయితీ పొందే అవకాశం కల్పించింది.
అతిపెద్ద బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు ఈఎంఐలను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉన్నది. వీటితోపాటు ఆజియో, రిలయన్స్ ట్రెండ్స్కు చెందిన రూ.4 వేల వరకు గిఫ్ట్ వోచర్స్ను కూడా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్లలో భాగంగా 55 అంగుళాల క్యూలెడ్ టీవీ ధర రూ.35,990గా నిర్ణయించిన సంస్థ..దీనిపై రెండేండ్ల వ్యారెంటీ కూడా కల్పిస్తున్నది.