ముంబై, జనవరి 22: గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘డిజిటల్ ఇండియా సేల్’తో ప్రకటించిన ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్లతోపాటు మై జియో స్టోర్లో కూడా లభించనున్నాయి. ఎలక్ట్రానిక్స్ పరికరాలపై రాయితీలతోపాటు ఏదైనా బ్యాంక్నకు చెందిన క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్ళు జరిపిన వారికి తక్షణమే 6 శాతం రాయితీ పొందవచ్చునని సూచించింది. సిటీ బ్యాంక్నకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డ్ కలిగిన వారికి ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తగ్గింపు లభించనున్నది. అలాగే రూ.5 వేల కొనుగోలుపై రూ.1,000 విలువైన రిలయన్స్ డిజిటల్ వోచర్ ఇస్తున్నది. టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, వేరబుల్స్, గృహోపకరణాలపై ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 26 వరకు చెల్లుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన వివో, షియోమీ, సామ్సంగ్లకు చెందిన స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది.