బార్సిలోనా, మార్చి 3: వచ్చే 6 నెలల్లో వాయిస్ కాల్ ఆధారిత స్కాంల నియంత్రణకూ ఓ పరిష్కారాన్ని చూపగలమన్న విశ్వాసాన్ని తాన్లా ప్లాట్ఫామ్స్ కనబర్చింది. ఇప్పటికే ఫిషింగ్ దాడుల నిరోధానికి ఓ ప్లాట్ఫామ్ను తాన్లా తీసుకురాగా.. ఇదిప్పుడు ట్రయల్స్ దశలో ఉన్నది. ఈ నేపథ్యంలో మొబైల్ యూజర్లను బాధిస్తున్న వాయిస్ కాల్ బేస్డ్ స్కామ్స్ నియంత్రణకు కృషి చేస్తామని తాన్లా ప్లాట్ఫామ్స్ వ్యవస్థాపక చైర్మన్, సీఈవో డీ ఉదయ్రెడ్డి తెలిపారు. భారత్లో సుమారు 30 కోట్ల మంది ఫిషింగ్ దాడులతో సతమతమవుతున్నారని, ఇందులో దాదాపు 5 లక్షల మంది మోసాల బారినపడుతున్నారని చెప్పారు. ఈ ఏడాదికిగాను ఇక్కడ జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ఈ హైదరాబాదీ సంస్థ యాంటీ-ఫిషింగ్ ప్లాట్ఫామ్ (ఫిషింగ్ నిరోధక వ్యవస్థ)ను ఆవిష్కరించింది. ఈ క్రమంలోనే పీటీఐతో ఉదయ్రెడ్డి మాట్లాడుతూ.. ఫిషింగ్ దాడుల నిరోధానికి పరిష్కారాన్ని కనుగొంటున్న సమయంలో ఈ సమస్య యావత్తు ప్రపంచాన్నే వేధిస్తున్నదని గుర్తించామన్నారు. నిజానికి రకరకాల కారణాల మధ్య బాధితుల్లో కేవలం 7 శాతం మందే ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు.