హైదరాబాద్, జనవరి 10: మొబైల్ విక్రయ సంస్థ సెలెక్ట్..సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ‘సూపర్ సంక్రాంతి సేల్’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని స్మార్ట్ఫోన్లపై రూ.3 వేల వరకు తగ్గింపు ధరకే విక్రయిస్తున్న సంస్థ… హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి 7.5 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్, రూ.999 ప్రారంభ ధరతో బ్రాండెడ్ స్మార్ట్వాచ్, ఇయర్బడ్స్ రూ.799 నుంచి, ఎక్సేంజ్తో అన్ని బ్రాండెడ్లపై రూ.30 వేల వరకు తగ్గింపు ధరకే అందిస్తున్నది. ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసిన వారికి రూ.2,999కే స్మార్ట్ టీవీ/సౌండ్ బార్ను అందిస్తున్నది.
మరోవైపు కంపెనీ రిటైల్ అవుట్లెట్లో రెడ్మీ నోట్ 13 5జీ ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా సంస్థ ఈడీ మురళీ రేతినేని మాట్లాడుతూ..కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని, కొత్త మాడళ్లను ప్రవేశపెట్టడంలో సెలెక్స్ మొబైల్స్ ముందువరుసలో ఉంటుందని, ఇదే ఒరవడిని కొనసాగిస్తూ రెడ్మీ నోట్ 13 5జీ ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న రిటైల్ అవుట్లెట్లలో లభించనున్నదన్నారు. 6.67 అంగుళాల టచ్స్క్రీన్ తయా రు చేసిన ఈ నోట్ 13 ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియా టెక్, 8జీబీ/128 జీబీ వంటి ఫీచర్తో రూపొందించింది.