హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్కు తాజాగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. స్టాండర్డ్ అండ్ పూర్ డోజోన్స్ సైస్టెన్బిలిటీ వరల్డ్ ఇండెక్స్లో స్థానం సంపాదించుకుంది. ఈ ఇండెక్స్లో చేరిన తొలి భారత్ ఫార్మా కంపెనీ ఇదే. అలాగే గ్లోబల్ సైస్టెన్బిలిటీ రేటింగ్ ఏజెన్సీ ఎకోవాడిస్ డాక్టర్ రెడ్డీస్కు ‘గోల్డ్ మెడల్’ హోదాను ప్రదానం చేసింది. తాము ఎన్విరాన్aమెంట్ సోషల్ గవర్నెన్స్ (ఈఎస్జీ) అజెండాలో సాధిస్తున్న ప్రగతితో వరుస అంతర్జాతీయ గుర్తింపులు లభిస్తున్నాయని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ తెలిపారు.