హైదరాబాద్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నార్జో సిరీస్లో సరికొత్త మోడల్ను నేడు భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చిన రియల్మీ నార్జో 50A ప్రైమ్ (Narzo 50A Prime)మోడల్ను మరింత అభివృద్ధి చేసి నార్జో 50A ప్రైమ్ వర్షన్ను రూపొందించింది. దీనిని ఇప్పటికే ఇండోనేషియాలో విడుదల చేసింది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేను అందించారు. యూనిసోక్ టీ612 ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందించనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనిని సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్+128 జీబీ కాన్ఫిగరేషన్తో రెండు వేరియంట్లు అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ను ధర 19,99,000 ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.10,600) నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 21,99,000గా ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.11,700) ఉంది.
ప్రాసెసర్: ఆక్టాకోర్ యూనిసోక్ టీ612
డిస్ప్లే: 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ర్యామ్: 4 జీబీ ర్యామ్ + 64 జీబీ, 4జీబీ ర్యామ్ + 128 జీబీ
రియర్ కెమెరా: మూడు రియర్ కెమెరాలు. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, ఒక మోనోక్రోమ్ పొర్ట్రెయిట్ సెన్సార్, మాక్రో సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్