మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని కీసర పరిధిలో డీజిల్ అక్రమ నిల్వ కేంద్రంపై పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా దాదాపు 30 వేల లీటర్ల డీజిల్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు లారీల నుంచి డీజిల్ దొంగిలించి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.