Master Card | అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సంస్థ మాస్టర్కార్డ్ ( Mastercard )పై ఉన్న నిషేధాన్ని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఎత్తేసింది. కస్టమర్ల డేటా స్థానికంగా నిల్వ చేయాలన్న నిబంధనను అమలు చేయనందుకు కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా గతేడాది జూలై (2021 July) లో నిషేధం విధించింది. తాజాగా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
2018 ఏప్రిల్ ఆరో తేదీన జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం కస్టమర్ల డేటా స్థానికంగా నిల్వ చేయాలన్న నిబంధన అమలు చేసినందుకు తక్షణం దేశీయంగా మాస్టర్ కార్డ్ నూతన ఖాతాదారులను చేర్చుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీంతో దేశంలోని వివిధ బ్యాంకులు జారీ చేసే క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డులకు సంబంధించి మాస్టర్ కార్డ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రూపే కార్డులు మాత్రమే దేశీయ బ్యాంకులు జారీ చేస్తున్నాయి.
2021 జూలై 22 నుంచి తన కార్డ్ నెట్వర్క్లో (డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్) చేర్చుకునేందుకు నూతన ఖాతాదారులను నిషేధం విధించింది ఆర్బీఐ. ఆర్బీఐ నిషేధాన్ని ఎదుర్కొన్న కంపెనీల్లో మాస్టర్ కార్డ్ మూడవది. స్థానికంగా డేటా స్టోరేజీ సమస్యపైనే ఇంతకుముందు అమెరికా ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థలను ఆర్బీఐ నిషేధించింది.