BharatPe-Centrum | భారత్ పే, సెంట్రం గ్రూప్ అనుబంధ సెంట్రం ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ జాయింట్ వెంచర్కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) ఏర్పాటు చేసేందుకు ఆర్బీఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇందులో రెండు సంస్థలకు సమాన వాటాలు ఉంటాయి. అందుకు ఆర్బీఐ గైడ్లైన్స్, టైమ్లైన్స్ జారీ చేసింది.
దీనిపై సెంట్రం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్పాల్ బింద్రా స్పందిస్తూ.. ఆరేండ్ల విరామం తర్వాత తమకు నూతన బ్యాంక్ లైసెన్స్ మంజూరైనందుకు ఆనందంగా ఉందన్నారు. తమ పట్ల విశ్వాసం చూపినందుకు ఆర్బీఐకి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. భారత్ పే భాగస్వామ్యం.. శక్తిమంతమైన టీమ్తో నూతన బ్యాంక్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
భారత్ పే కో ఫౌండర్ కం సీఈవో అశ్నీర్ గ్రోవర్ మాట్లాడుతూ..ఉన్నత స్థాయి టెక్నాలజీ సాయంతో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా అణగారిన వర్గాలకు రుణ పరపతి, పెట్టుబడి, పేమెంట్ సేవలందించేందుకు అవకాశం కలిగిందన్నారు. ఇందుకు తాము ఆనందిస్తున్నామని పేర్కొన్నారు. సెంట్రం భాగస్వామ్యంతో ప్రపంచ ప్రమాణాలతో కూడిన సంస్థను సృష్టిస్తామని తెలిపారు.