న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడమే ఆలస్యం ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు తమ వడ్డీరేట్లను అమాంతం పెంచేశాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఏకంగా 50 బేసిస్ పాయింట్లు పెంచేసింది. ఎక్స్టర్మల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండిం గ్ రేటు(ఈబీఎల్ఆర్), రెపో-లింక్డ్ ఆధారిత రుణాలపై వడ్డీరేటును అర శాతం పెంచేసింది. దీంతో ఈబీఎల్ఆర్ రేటు 8.55 శాతానికి చేరుకోగా, ఆర్ఎల్ఎల్ఆర్ 50 బేసిస్ పాయిం ట్లు సవరించడంతో రేటు 8.15 శాతానికి చేరుకున్నది. అలాగే ఆస్తి తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కూడా వడ్డీరేటును అర శాతం వరకు సవరించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆర్బీఎల్ఆర్ని 8.75 శాతం వరకు సవరించింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ ఈబీఎల్ఆర్ని 9.60 శాతానికి పెంచేసింది.