RBI | ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా.. ఎస్బీఐ ఎండీ స్వామినాథన్ జానకీరామన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. స్వామినాథన్ జానకీ రామన్ ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగుతారు. ఇప్పటి వరకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఉన్న మహేశ్ కుమార్ జైన్ పదవీ కాలం గురువారం ముగియనుండడంతో కేంద్రం ఈ నియామకం చేపట్టింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్కు నెలకు రూ.2.5 లక్షల వేతనం, ఇతర అలవెన్సులు లభిస్తాయి.
మహేశ్ కుమార్ జైన్ ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పర్యవేక్షణ, డెవలప్ మెంట్ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. జానకీ రామన్కు ఇవే బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ గవర్నర్లుగా మైఖేల్ పాత్ర, ఎం రాజేశ్వరరావు, టీ రవి శంకర్ పని చేస్తున్నారు. గత జనవరిలో మైఖేల్ పాత్ర పదవీ కాలం ముగియడంతో 2024 జనవరికి పొడిగించారు. వచ్చే జనవరిలో మైఖేల్ పాత్ర పదవీ కాలం ముగియనున్నది.