న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: దేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటైర్లెన ఐనాక్స్..పీవీఆర్లు దూకుడు పెంచాయి. ఇటీవల ఇరు సంస్థలు వీలనమవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇరు సంస్థలు కొత్తగా 2 వేల స్క్రీన్లను వచ్చే ఏడేండ్లకాలంలో ప్రారంభించాల నుకుంటున్నాయి. ఇందుకోసం రూ.4 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఒక్కో స్క్రీన్కు 2.5 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయబోతున్నట్లు ఐనాక్స్ లీజర్ డైరెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. విలీనం తర్వాత ప్రారంభంకానున్న సినిమా హాళ్ళు పీవీఆర్ ఐనాక్స్గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం పీవీఆర్కి 871 స్క్రీన్లు ఉండగా, ఐనాక్స్కు 675 స్క్రీన్లు ఉన్నాయి.