హైదరాబాద్, జూన్ 25: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్..తెలంగాణ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలో 199 శాఖలను నిర్వహిస్తుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 50శాఖలను ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని బ్యాంక్ కమర్షియల్ బ్యాంకింగ్ గ్రూపు హెడ్ విజయ్ శెట్టి తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేసే శాఖల్లో హైదరాబాద్లో పది, మిగతా 40 రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. బ్యాంక్ చిన్నస్థాయి సంస్థలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రత్యేకంగా రుణ మేళాను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.