న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్యాసింజర్ వాహన ధరలను టాటా మోటర్స్ సోమవారం 0.8 శాతం మేర పెంచింది. మంగళవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మోడల్, వేరి యంట్ ఆధారంగా ధరలు పెరుగుతాయని ఓ ప్రకటనలో సంస్థ స్పష్టం చేసింది. ఉత్పాదక వ్యయం భారంతోనే ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు.