న్యూఢిల్లీ, జనవరి 25: కుమారులపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు విప్రో అధినేత అజీం ప్రేమ్జీ. ఇద్దరు కుమారులైన రిషద్, తారిఖ్ ప్రేమ్జీలకు విప్రోలో తనకున్న షేర్లలో 1.02 కోట్ల షేర్లను బహుమతిగా అందించారు. ప్రస్తుత షేరు ధర రూ.472.9 ప్రకారం వీటి విలువ రూ.483 కోట్లు. ప్రస్తుతం విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా రిషద్ ప్రేమ్జీ వ్యవహరిస్తున్నారు. 0.20 శాతానికి సమానమైన 1,02,30,180 ఈక్విటీ షేర్లను తన కుమారులైన రిషద్ అజీం ప్రేమ్జీ, తారిఖ్ అజీం ప్రేమ్జీలకు బహుమతిగా అందచేస్తున్నట్లు అజీం ప్రేమ్జీ ఒక ప్రకటనలో వెల్లడించారు.