న్యూఢిల్లీ : పాపులర్ బ్రాండ్ ఎంబీఏ ఛాయ్వాలా వ్యవస్ధాపకుడు ప్రఫుల్ బిల్లోర్ రూ. కోటి విలువైన మెర్సిడెస్ లగ్జరీ ఎస్యూవీని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. లగ్జరీ కారును కొనుగోలు చేసిన వీడియోను ప్రఫుల్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా అది వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ప్రఫుల్ తన సోదరుడు వివేక్ బిల్లోర్ సహా కుటుంబ సభ్యులతో ఈ క్లిప్లో కనిపించాడు. వీరంతా షోరూమ్కు వచ్చి లగ్జరీ కారును ఆవిష్కరించి అరుదైన ఫీట్ను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 20 లక్షలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది.
ఇన్స్టాగ్రాం యూజర్లు ప్రఫుల్ను అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. ప్రఫుల్ బిల్లోర్ వ్యాపారవేత్తే కాకుండా కీనోట్ స్పీకర్, ఏంజెల్ ఇన్వెస్టర్, కంటెంట్ క్రియేటర్ కూడా. 2017లో ఎంబీఏ డ్రాపవుట్ చేసిన ప్రఫుల్ అహ్మదాబాద్లో టీ స్టాల్ ఏర్పాటు చేసి దాన్ని పూర్తిస్ధాయి ఫ్రాంచైజీ బిజినెస్గా డెవలప్ చేశాడు. ప్రఫుల్ చిత్తశుద్ధి, కష్టించేతత్వం, అంకిత భావంతో ఎదిగిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.