Postal Savings | పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ల్లో మీరు ఇన్వెస్ట్ చేశారా.. అయితే మీకో గుడ్ న్యూస్.. పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో బ్యాలెన్స్ గురించి గానీ, మినీ స్టేట్ మెంట్ గానీ ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తపాలాశాఖ. ఇందుకోసం తమ ఖాతాదారులకు ఈ-పాస్బుక్ ఫెసిలిటీ తీసుకొచ్చింది. బుధవారం నుంచే అందుబాటులోకి వచ్చిందీ ఈ-పాస్బుక్ సౌకర్యం.
కొత్తగా ఆన్లైన్లో పోస్టాఫీసు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్లో డబ్బు జమ చేసే వారు తమ అకౌంట్ డిటైల్స్ ఎక్కడ నుంచైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. ఆయా స్కీమ్స్తోపాటు నమోదు చేసే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఆన్లైన్లో వివరాలు తెలుసుకునే సౌకర్యం పొందొచ్చు. ఈ ఫెసిలిటీ పొందడానికి నెట్ బ్యాంకింగ్ గానీ, యాప్గానీ అవసరం లేదు. ఈ వసతి కల్పించినందుకు ఎటువంటి ఫీజు కూడా వసూలు చేయబోమని తపాలాశాఖ తన నోటిఫికేషన్లో వెల్లడించింది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, ఫుల్ స్టేట్మెంట్ తదితర వివరాలు చూసుకోవచ్చు. ఈ సేవల కోసం మీరు డబ్బు జమ చేసిన పోస్టాఫీసు బ్రాంచ్కు వెళ్లాల్సిన అవసరం లేదు.
పోస్టల్ శాఖ www.indiapost.gov.in. www.ippbonline.com వెబ్సైట్లలోకి వెళ్లాలి. లేకపోతే నేరుగా https://posbseva.ippbonline.com/indiapost/signin వెబ్సైట్లోకి వెళాలి. అందులో ఈ-పాస్బుక్ లింక్పై క్లిక్ చేయాలి.
ఈ పథకాలకు మాత్రమే అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆప్షన్ ఇతర సేవింగ్స్ పథకాలకు విస్తరిస్తారని అంటున్నారు. 10 లావాదేవీలపై మినీ స్టేట్మెంట్ పొందొచ్చు. అంతేకాదు పీడీఎఫ్ ఫార్మాట్లో కూడా పొందొచ్చు.