న్యూఢిల్లీ, జనవరి 25: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను రూ.2,223 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.629 కోట్ల లాభంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.25,722 కోట్ల నుంచి రూ.29,962 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.22,384 కోట్ల నుంచి రూ.27,289 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది.