ముంబై, జూన్ 17: హై వాల్యూ చెక్ల క్లియరెన్స్కు వాటి పూర్తి వివరాలివ్వాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కస్టమర్లను కోరింది. అధిక విలువగల చెక్కుల్లో మోసాల్ని నిరోధించేందుకు బ్యాంక్ ఈ చర్య తీసుకుంది. పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) ఫ్రేమ్వర్క్లో హై వాల్యూ చెక్కుల క్లియరెన్స్ జరిగేందుకు కనీసం ఒక రోజు ముందు చెక్ నంబర్, చెక్ మొత్తం, తేదీ, లబ్దిదారు పేరు తదితర అత్యవసర వివరాల్ని ఖాతాదారులు ధృవీకరించాలని పీఎన్బీ తెలిపింది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన పీపీఎస్ కింద కస్టమర్ జారీచేసే హై వాల్యూ చెక్లకు అందించిన వివరాల్ని సరిచూసిన తర్వాత చెక్ను పేమెంట్ కోసం ప్రెజెంట్ చేయనున్నట్టు బ్యాంక్ వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి రూ.10 లక్షలకు పైగా విలువగల చెక్లకు పీపీఎస్ ఫ్రేమ్వర్క్ను పీఎన్బీ తప్పనిసరి చేసింది. అయితే రిజర్వ్బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం రూ. 50,000కంటే అధిక విలువగల చెక్లకు పీపీఎస్ సదుపాయాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కల్పిస్తున్నది. చెక్ల వివరాల్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ల ద్వారా తెలియచేయవచ్చని బ్యాంక్ పేర్కొంది.