హైదరాబాద్, మే 30: గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పన్ను చెల్లించిన తర్వాత రూ.24.83 కోట్లు నికర లాభాన్ని గడించింది పిట్టీ. రూ.247.51 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాదిలో వచ్చిన రూ.271.39 కోట్లతో పోలిస్తే 8.80 శాతం తగ్గింది.
2022-23లో రూ. 1,100 కోట్ల ఆదాయంపై రూ.51.89 కోట్ల లాభాన్ని గడించింది. రూ.5 విలువ కలిగిన ప్రతిషేరు కు రూ.1.20 డివిడెండ్ను ప్రకటించింది.