న్యూఢిల్లీ, మార్చి 11: ఫిన్టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఫోన్పే మరో మైలురాయికి చేరుకున్నది. 60 కోట్ల మంది కంపెనీ సేవలు పొందుతున్నారని పేర్కొంది. ఆర్థిక సేవలు ప్రారంభించి పదేండ్లు పూర్తైన సందర్భంగా ఈ కీలక రికార్డును సొంతం చేసుకోవడం విశేషమని కంపెనీ కో-ఫౌండర్, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు.
గతపదేండ్లలో సంస్థ అన్ని రంగాల్లో సేవలు అందిస్తున్నదని, ముఖ్యంగా వెల్త్ మేనేజ్మెంట్, ఈ-కామర్స్ వంటి విభాగాలు కూడా ఉన్నాయన్నారు. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న కంపెనీ విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉన్నది.