షిల్లాంగ్: విద్యుత్ వాహనాల వాడకం దిశగా దేశం శరవేగంగా పరుగులు తీస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ (ఈవీసీఎస్) నిర్మాణం చేపట్టనున్నది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్). మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని లాపాలంగ్ కాంప్లెక్స్ వద్ద ఈవీసీఎస్ నిర్మాణానికి పవర్ గ్రిడ్ శంకుస్థాపన చేసింది.
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ (హైబ్రీడ్) అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2) కింద ఈ ఈవీ చార్జింగ్ స్టేషన్ను నిర్మిస్తోంది పవర్ గ్రిడ్. షిల్లాంగ్ సిటీలోనే 11 చార్జింగ్ స్టేషన్లను నిర్మించనున్నది. హైదరాబాద్తోపాటు అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్, కోచి నగరాల్లోనూ ఈవీసీఎస్ బిజినెస్లో భాగస్వామి కానున్నది.