హైదరాబాద్, జనవరి 13: అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఫైజర్ నుంచి డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ రొమ్ము క్యాన్సర్ చికిత్సా ఔషధం ప్రిమ్సైవ్ను భారత్లో వినియోగించేందుకు ట్రేడ్ మార్క్ హక్కుల్ని కొనుగోలు చేసింది. 2022 మే నెల నుంచి ఫైజర్ ప్రొడక్ట్స్ ఇండియాతో డాక్టర్ రెడ్డీస్ కలిసి ఈ డ్రగ్ను ప్రిమ్సైవ్ బ్రాండ్నేమ్తో భారత్లో మార్కెట్ చేస్తున్నది.
తాజాగా దేశీ మార్కెట్లో వినియోగానికి పూర్తిగా ట్రేడ్మార్క్ హక్కుల్ని చేజిక్కించుకుంది. పాల్బోసిక్లిబ్ యాక్టివ్ ఇండీగ్రియంట్ కలిగిన ప్రిమ్సైవ్ను మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు వాడతారు. 75ఎంజీ, 100ఎంజీ, 125 ఎంజీల స్ట్రెంత్తో క్యాప్సుల్ రూపంలో ఈ ఔషధం లభిస్తుంది. ట్రేడ్మార్క్ హక్కుల్ని సొంతం చేసుకోవడంతో తమ ప్లాంట్లలోనే ఈ డ్రగ్ను ఉత్పత్తి చేయనున్నట్టు రెడ్డీస్ తెలిపింది.