Paytm -Ayodhya | అయోధ్యలో రాముడిని దర్శించుకునే వారికి ప్రముఖ ఫిన్టెక్ సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి విమానం, బస్సుల ద్వారా ప్రయాణం చేసే వారికి ప్రయాణ చార్జీలో 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. అయోధ్యకు వెళ్లే వారు బస్సు రిజర్వేషన్ కోసం ‘బస్ అయోధ్య (BUSAYODHYA)’, విమాన ప్రయాణమైతే ‘ఫ్లైఅయోధ్య (FLYAYODHYA)’ అనే ప్రోమో కోడ్ ఉపయోగించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఈ ప్రోమో కోడ్ వినియోగించుకున్న వారిలో ప్రతి పది మందిలో ఒకరికి క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. బస్సు ప్రయాణికులకు గరిష్టంగా రూ.1000, విమాన ప్రయాణికులకు రూ.5,000 వరకూ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
బస్సు రిజర్వ్ చేసుకున్న వారికి ‘లైవ్ బస్ ట్రాకింగ్ సర్వీస్’ అనుమతి ఇస్తుంది. టికెట్ బుక్ చేసుకున్న వారు తమ సంబంధీకులు వారు ఎక్కడో ఉన్నారో తెలుసుకునేందుకు రియల్ టైం లొకేషన్ షేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు రామ మందిర నిర్మాణానికి శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టుకు పేటీఎం తన యాప్ ద్వారా విరాళాలిచ్చేందుకు ‘డివోషన్’ సెక్షన్ తీసుకొచ్చింది.