ముంబై, ఫిబ్రవరి 3: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్, పతంజలి ఆయుర్వేద సంస్థలు సంయుక్తంగా కాంటాక్ట్లెస్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ భాగస్వామ్యంతో విడుదల చేసిన ఈ క్రెడిట్ కార్డులు పీఎన్బీ రూపే ప్లాటినం, పీఎన్బీ రూపే సెలెక్ట్ రెండు రకాల్లో లభించనున్నాయి. ఈ కో-బ్రాండెడ్ కార్డుల ద్వారా క్యాష్బ్యాక్ ఆఫర్లతోపాటు లాయల్టీ పాయింట్లు, బీమా కవరేజ్తోపాటు పలు రకాల ప్రయోజనాల్ని పొందవచ్చునని పతంజలి వెల్లడించింది. ఈ కార్డుతో పతంజలి స్టోర్లో రూ.2,500కి పైగా కొనుగోళ్ళు జరిపిన వారికి రెండు శాతం క్యాష్బ్యాక్ లభించనున్నది. ప్లాటినం కార్డు కలిగిన వారు ఆకస్మికంగా మరణిస్తే రెండు లక్షల వరకు జీవిత బీమా కవరేజ్ను కల్పిస్తున్నది. ప్లాటినం కార్డుపై రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు, ఎంపిక చేసిన కార్డుపై రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చును.