Auto Sales | ప్రస్తుత పండుగల సీజన్లో ప్యాసింజర్ల వెహికల్స్కు మంచి గిరాకీ ఉంటుందని గ్రాంట్ థోర్టన్ భారత్ ఆటో సర్వే నిగ్గు తేల్చింది. ప్రత్యేకించి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ), హైబ్రీడ్ మోడల్ కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఆ సర్వే పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ పండుగల సీజన్లో ప్యాసింజర్ వెహికల్స్ .. కార్లకు 34 శాతం డిమాండ్ పెరుగుతుందని ఈ సర్వేలో బయటపడింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీ క్రమంగా పుంజుకున్నదని సర్వేలో పాల్గొన్న వ్యక్తులు తెలిపారు.
సప్లయ్ చైన్లో సమస్యలు పరిష్కారం కావడంతోపాటు కరోనా తర్వాత పర్సనల్ మొబిలిటీ ప్రాధాన్యం పెరిగిపోయిందని, దీనికితోడు ఫెస్టివ్ సెంటిమెంట్తో పరిస్థితి మెరుగు పడుతుందని గ్రాంట్ థోర్టన్ భారత్ పార్టనర్, నేషనల్ సెక్టార్ (ఆటో) లీడర్ సాకేత్ మెహతా తెలిపారు. దీనికితోడు ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వెహికల్స్కు డిమాండ్ పెరిగిపోయిందన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆధ్వర్యంలో ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ వనరులతో కూడిన వాహనాలకు గిరాకీ ఎక్కువ అవుతుందన్నారు.
ఎస్యూవీలను 31 %, కంపాక్ట్ కార్లు 28 శాతం మంది కోరుకున్నట్లు సర్వేలో తేలింది. ఎస్యూవీ మోడల్ కార్లకు ఐదు రెట్లు పెరిగిపోయిందని సర్వే వివరించింది. 2021తో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లకు 46శాతం, హైబ్రీడ్ కార్లకు 62 శాతం డిమాండ్ పెరుగుతుందని ఈ సర్వేలో పాల్గొన్న వారు నిర్ధారించారు. 29 శాతం మంది అధిక మొత్తం చెల్లించి ప్రీమియం మోడల్ కారు కోసం తమ వద్ద ఉన్న కారు మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 57 శాతం మంది బేస్, ప్రీమియం వేరియంట్ల ధరల మధ్య తేడా కూడా ఆయా వాహనాల కొనుగోలు డిమాండ్కు అద్దం పడుతుందని పేర్కొన్నారని గ్రాంట్ థోర్టన్ భారత్ ఆటో సర్వే వివరించింది. డిజిటల్ ప్లాట్ఫామ్లపై జరిగిన 4000 మంది సర్వేలో పాల్గొన్నారు.