హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన క్లౌడ్ కమ్యూనికేషన్ సేవల సంస్థ ఓజోన్టెల్..రూ.37.44 కోట్ల నిధులను సమీకరించింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రైవేట్ ఈక్విటి సంస్థ స్టేక్ బోట్ క్యాపిటల్ నుంచి ఏ సిరీస్ ఫండింగ్లో భాగంగా 5 మిలియన్ డాలర్లు (రూ.37.44) సేకరించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. వచ్చే ఏడాది అమెరికాలో కంపెనీ కార్యకలాపాలను విస్తరించడం కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు ఓజోన్టెల్ వ్యవస్థాపకులు సీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. తద్వారా ఇప్పటి వరకు కంపెనీకి ఉన్న క్లయింట్ల సంఖ్యను రెట్టింపు చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. మా సంస్థ వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించడానికి మంచి తరుణంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.