హైదరాబాద్, అక్టోబర్ 9: జీవోసీఎల్ కార్పొరేషన్ లిమిటెడ్(జీవోసీఎల్) అనుబంధ సంస్థయైన ఐడీఎల్ ఎక్స్ప్లోసివ్ లిమిటెడ్(ఐడీఎల్ఈఎల్)కు కోల్ ఇండియా నుంచి 766 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్లో భాగంగా అక్టోబర్ 2025 వరకు పేలుడు పదార్థాలు సరఫరా చేయాల్సి ఉంటుందని కంపెనీ ఎండీ, సీఈవో పంకజ్ తెలిపారు కోల్ ఇండియా నుంచి ఆర్డర్ రావడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు.