బీజింగ్ : ఒప్పో లేటెస్ట్ కే సిరీస్ స్మార్ట్ఫోన్ కే9 ప్రో 5జీను చైనాలో లాంఛ్ చేసింది. 120హెచ్జడ్ అమోల్డ్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలు, 1200 చిప్సెట్తో మీడియాటెక్ డైమెన్సిటీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో ఈ డివైజ్ను కస్టమర్ల ముందుకుతెచ్చింది. రూ 25,000 పలికే ఈ స్మార్ట్ఫోన్ సెప్టెంబర్ 30 నుంచి అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్లో లభిస్తుందని గిజ్మోచైనా పేర్కొంది. ఇక కే9 ప్రో ఫీచర్ల విషయానికి వస్తే 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ అమోల్డ్ స్క్రీన్, హెచ్డీఆర్10 సపోర్ట్, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ కలిగిఉన్న స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్11 ఆధారిత కలర్ ఓఎస్ 11.3పై రన్ అవుతుంది.
ఫాస్ట్ చార్జింగ్ సపో్ర్ట్తో కూడిన 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. 64ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8ఎంపీ అల్ట్రా వైడ్లెన్స్తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఆకర్షణగా నిలుస్తుంది. కనెక్టివిటీకి సంబంధించి ఈ డివైజ్లో వైఫీ 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, హెడ్ఫోన్ జాక్, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.