OnePlus Pad Go Tablet | చైనా టెక్నాలజీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మరో టాబ్లెట్ ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది. ‘వన్ ప్లస్ పాడ్ గో (OnePlus Pad Go)’ అనే పేరుతో వస్తున్న టాబ్లెట్.. మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఈ ‘వన్ ప్లస్ పాడ్’ టాబ్లెట్ పవర్ బ్యాకప్ కోసం 9510 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చింది. న్యూ ఆండ్రాయిడ్ టాబ్లెట్ విషయమై అధికారికంగా సమాచారం వెల్లడించలేదు.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న వన్ ప్లస్ పాడ్ అప్ గ్రేడ్ అయి మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. గత ఏప్రిల్లో మార్కెట్లోకి వచ్చిన వన్ ప్లస్ పాడ్ టాబ్లెట్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.37,999, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.39,999 పలికింది. సింగిల్ హలో గ్రీన్ ఫినిష్ కలర్ ఆప్షన్లో మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. అంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన వన్ ప్లస్ క్లౌడ్11 ఈవెంట్లో ‘వన్ప్లస్ పాడ్ (OnePlus Pad)’ ను ఆవిష్కరించింది.
వన్ ప్లస్ పాడ్ టాబ్లెట్ 11.61-అంగుళాల (2000×2800 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే విత్ అప్టూ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ఎస్వోసీ చిప్సెట్, 13-మెగా పిక్సెల్ కెమెరా మాడ్యూల్ ఆన్ బ్యాక్ విత్ సపోర్ట్ ఫర్ ఈఐఎస్, సెల్ఫీల కోసం 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి.