OnePlus Nord CE 3 Lite | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్.. భారత్ మార్కెట్లోకి నార్డ్ సీఈ3 లైట్ (OnePlus Nord CE 3 Lite) ఫోన్ను తీసుకొచ్చింది. నార్డ్ సీఈ2 లైట్ ఫోన్కు కొనసాగింపుగా నార్డ్ సీఈ3 లైట్ను తీసుకొచ్చింది. రూ.20 వేల లోపు ధరకే 5జీ ఫోన్, 108 మెగా పిక్సెల్స్ కెమెరా, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీస్ దీని స్పెషాలిటీ.
ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ ఫోన్ రెండు వేరియంట్లలో యూజర్లకు అందుబాటులో ఉంటుంది. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.21,999గా నిర్ణయించింది. రెండు ఫోన్లలోనూ వర్చువల్ రామ్ 8జీబీ అదనంగా పెంచుకోవచ్చు. ఈ నెల 11 నుంచి వన్ప్లస్ ఆన్లైన్ స్టోర్లు, అమెజాన్ ఇండియా, రిటైల్ స్టోర్లలో వన్ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ ఫోన్లు కొనుక్కోవచ్చు.
నార్డ్ సీఈ3 లైట్ ఫోన్తోపాటు వన్ప్లస్ నార్డ్ 2 బడ్స్ ఇయర్బడ్స్ కూడా వన్ప్లస్ విడుదల చేసింది. నాలుగు రంగుల్లో ఈ బడ్స్ లభ్యం అవుతాయి. పది నిమిషాల చార్జింగ్తో ఐదు గంటల పాటు వినియోగించుకోవచ్చు. భారత్ మార్కెట్లో బడ్స్ ధర రూ.2999 నుంచి మొదలవుతుంది. నార్డ్2 బడ్స్ వన్ప్లస్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మైంత్రా, వన్ప్లస్ ఎంటర్ప్రైజెస్ స్టోర్లలోలభిస్తాయి.