హైదరాబాద్, జనవరి 29: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.27.11 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.15.30 కోట్లతో పోలిస్తే 77 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొంది.
ఈవీ బస్సులను అధికంగా డెలివరీ చేయడంతో సంస్థకు గత త్రైమాసికంలో రూ.342.14 కోట్ల ఆదాయం సమకూరింది. గత త్రైమాసికం చివరినాటికి 1,615 యూనిట్ల ఈవీలను డెలివరీ చేయడం జరిగిందని, అయినప్పటికీ ఇంకా 8,088 యూనిట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నట్లు ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎండీ కేవీ ప్రదీప్ తెలిపారు. మరోవైపు, రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపూర్ వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న యూనిట్లో వచ్చే నెలలో ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.