హైదరాబాద్, ఆగస్టు 19: ఒలెక్ట్రా గ్రీన్టెక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూ డు నెలల కాలానికిగాను రూ. 575.5 కోట్ల ఆదాయంపై రూ.26.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
గత త్రైమాసికంలో సంస్థ 358 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు 4 వేలకు పైగా బస్సులను సరఫరా చేసినట్టు అయింది.