న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా మరో మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. నూతన ఎస్1 ఎక్స్+ 5.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999గా నిర్ణయించింది. ఈ ధర ఈ నెల 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నదని, ఆ తర్వాత ఈ స్కూటర్ ధరను సవరించనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
4680 భారత్ సెల్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నయా స్కూటర్ను తీర్చిదిద్దినట్టు చెప్పారు. 11 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ సింగిల్ చార్జింగ్తో 320 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. గంటకు 125 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్న ఈ స్కూటర్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్తో మరింత కంట్రోల్ చేయవచ్చునని తెలిపారు.