న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఓలా ఎలక్ట్రిక్..దేశీయ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ను పరిచయం చేసింది. మాస్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన ఎస్1జెడ్ మాడల్ ప్రారంభ ధర రూ.79,999గాను, గరిష్ఠ ధర రూ.99,999గా నిర్ణయించింది. సొంతంగా అభివృద్ధి చేసిన భారత్ సెల్ ఎల్ఎఫ్పీ టెక్నాలజీతో ఈ స్కూటర్ను 3.1 కిలోవాట్లు, 5.1 కిలోవాట్ల బ్యాటరీతో తీసుకొచ్చింది.
3.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ సింగిల్ చార్జింగ్తో179 కిలోమీటర్లు ప్రయాణించనుండగా, 5.1 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ 301 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న రిటైల్ అవుట్లెట్లలో ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ సీఎండీ భవిష్ అగర్వాల్ తెలిపారు. మరో మాడల్ మాత్రం వచ్చే మార్చి నుంచి మార్కెట్లో ప్రవేశించనున్నది.